తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ శనివారం మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీ రామచంద్రన్, అన్నాదురైల స్మారక కేంద్రాలను సందర్శించనున్నట్లు సమాచారం.
ఏఐఏడీఎంకే వ్యవస్థాపక దినోత్సవాలు ఆదివారం జరగబోతున్న తరుణంలో ఆమె ఈ నేతలకు నివాళులర్పిస్తారని తెలుస్తోంది. తాను రాజకీయాలకు, ప్రజా జీవితానికి దూరంగా ఉంటానని ఆమె మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఆమె తన రాజకీయ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, శశికళ రామవరం గార్డెన్లోని ఎంజీఆర్ హౌస్లో ఉన్న స్పెషల్ స్కూల్ను ఆదివారం సందర్శిస్తారని తెలుస్తోంది.