వచ్చే నెల 15న వరంగల్లో తెలంగాణ విజయగర్జన సభను అద్భుతంగా నిర్వహించుకుందాం. దీని కోసం ఎక్కడిక్కడ నాయకులు, కార్యకర్తలు కథానాయకులై పనిచేయాలి. 14 ఏండ్ల తెలంగాణ పోరాటం, ఏడేండ్లలో రాష్ట్రం సాధించిన ఘన విజయాలను ఈ సభ ద్వారా ప్రజల ముందు ఉంచేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకోవాలి.
గ్రామ పార్టీ అధ్యక్షులు, ఆ గ్రామసర్పంచ్ నేతృత్వంలో ప్రతీ గ్రామం నుంచి వాహనాలను సమకూర్చుకొని.. గ్రామ బ్యానర్తో విజయగర్జన సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. మన విజయాలను చూసి పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల ప్రజలు తాము కూడా తెలంగాణలో కలుస్తామని బాహాటంగా ప్రకటిస్తున్నారు. ‘పార్టీ బీ-ఫాం ఇవ్వండి చాలు.. గెలిచి వస్తాం’ అంటున్నారు.
అటువంటి ఘనతను టీఆర్ఎస్ సాధించామని ప్రతి గులాబీ సైనికుడూ సంతోషంగా చెప్పుకొనే స్థితికి చేరాం. టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చే నెల 15వ తేదీన వరంగల్లో పది లక్షల మందితో తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహిస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.