Home / MOVIES / అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన అమలపాల్

అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన అమలపాల్

ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన హీరోయిన్‌ అమలాపాల్‌ ఎక్స్‌పోజింగ్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని ఆమె తన ఫొటోలను షేర్‌ చేస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘సింధుసమవెలి’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ ఆ తర్వాత కోలీవుడ్‌లో ‘మైనా’, ‘వేట్టై’, ‘వేలైయిల్లా పట్టాదారి-1, 2’, ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్‌’, ‘రాక్షసన్‌’ వంటి చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లోనూ అమలాపాల్ తన సత్తా చాటింది.

హీరోయిన్‌గా కెరీర్‌ మంచి పీక్‌ స్టేజ్‌లో ఉన్న సమయంలో కోలీవుడ్‌ దర్శకుడు ఏఎల్‌. విజయ్‌ను ప్రేమించి.. 2014లో వివాహం చేసుకుంది. అయితే, వీరి దాంపత్య జీవితం ఎక్కువ రోజులు కొనసాగలేదు. 2017లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. కానీ, సినిమాల్లో మాత్రం ఎప్పటిలానే నటిస్తున్నారు. అయితే, హీరోయిన్‌ ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో మాత్రమే నటిస్తూ అమలాపాల్ ముందుకుసాగుతోంది.

ఆమె చివరిగా నటించిన చిత్రం ‘ఆడై’. ఇందులో ఆమె నటనకు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం ‘అదో అంద పరవై పోల’, ‘ఆడుజీవితం’ చిత్రాలు చేతిలో ఉండగా, తన సొంత నిర్మాణ సంస్థపై ‘కడావర్‌’ అనే పేరుతో ఓ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అమలాపాల్‌ ప్రధాన పాత్రను పోషిస్తోంది. అయినప్పటికీ తనకు లభించిన ఖాళీ సమయాన్ని ఆమె వృథా చేసుకోకుండా, ఎక్స్‌పోజింగ్‌‌తో రెచ్చిపోతూ.. ప్రత్యేక ఫొటో షూట్‌లు నిర్వహిస్తూ మంచి పబ్లిసిటీని సంపాదించుకుంటోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat