దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలుఘనంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా ఆనందోత్సాహాలతో టపాసులు కాలుస్తూ దీపావళిని జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు ట్రెండీ స్టైల్ను పక్కన పెట్టి సంప్రదాయ వస్త్రధారణలో పండుగ జరుపుకున్నారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ముంబైలోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి దీపావళిని జరుపుకుంది. పొట్టి దుస్తుల్లో కనిపించే జాన్వీకపూర్ ఈ సారి లంగావోణి పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది.
జాన్వీ సోదరి ఖుషీకపూర్ కూడా లంగావోణి వేసుకోగా..బోనీకపూర్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా వేసుకున్నారు. జాన్వీకపూర్ తన తల్లి శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసేలా వేసుకున్న సంప్రదాయ వస్త్రధారణ లుక్కు సంబంధించిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.