Home / NATIONAL / భారత ఎన్నికల సంఘం స్పెషల్ సమ్మరీ రివిజన్- 2022

భారత ఎన్నికల సంఘం స్పెషల్ సమ్మరీ రివిజన్- 2022

భారత ఎన్నికల సంఘం స్పెషల్ సమ్మరీ రివిజన్- 2022 విడుదల చేసిన ఓటరు జాబితా పై ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ నెల 6, 7 తేదీలలో, 27, 28 శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపెన్ నిర్వహించడం జరుగుతుంది. అట్టి ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకొనుటకు అవకాశం కల్పించింది.

అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లేవల్ అధికారులు ముసాయిదా ఓటరు జాబితాతో అందుబాటులో ఉండి దరఖాస్తు స్వీకరిస్తారని జిహెచ్ఎంసి తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినవారు నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని, ఓటరు జాబితాలో నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఓటరు జాబితాను నుండి పేర్లు తొలగించడానికి, డబుల్ ఓటరుగా నమోదు అయినవారు ఫారం-7 ద్వారా, ఓటరు జాబితాలో తప్పులు సరిచేసుకోవడం కొరకు ఫారం -8 ద్వారా, ఒకే నియోజకవర్గంలో ఇతర అడ్రెస్ కు మార్పు చేసుకొనుటకు ఫారం- 8ఏ ద్వారా గాని www.ceotelangana.nic.in లేదా www.nvsp.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ప్రజలందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat