Home / MOVIES / Priyamani విడాకులు తీసుకుందా..?

Priyamani విడాకులు తీసుకుందా..?

ప్రస్తుతం  సెల‌బ్రిటీల వైవాహిక బంధాలు ఎక్కువ రోజులు నిల‌వ‌డం లేదు. పెళ్లైన మూడు నాలుగు సంవ‌త్స‌రాల‌కే విడాకులు తీసుకుంటున్నారు.రీసెంట్‌గా స‌మంత‌-చైతూలు విడాకులు తీసుకోగా, గ‌త కొద్ది రోజులుగా ప్రియాంక త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌బోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. గతంలో ముస్తఫాకు నేను విడాకులు ఇవ్వ‌లేద‌ని, ఇప్ప‌టికి నేను అత‌ని భార్య‌నే అని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించింది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్‌ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ సంఘ‌ట‌న త‌ర్వాత ప్రియ‌మ‌ణి- ముస్తాఫాకు గొడ‌వ జ‌రిగింద‌ని, త్వ‌ర‌లో విడాకులు కూడా తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌చారం చేశారు. ఈ నేప‌థ్యంలో ప్రియ‌మ‌ణి పెట్టిన పోస్ట్ పుకార్ల‌న్నింటికి అడ్డుక‌ట్ట వేసింది. దీపావళి సందర్భంగా భర్త ముస్తాఫా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. భర్తతో చిరునవ్వులు చిందిస్తూ ప్రియ‌మ‌ణి క‌నిపించ‌గా, ఈ ఫొటోతో వారి విడాకుల‌పై పూర్తి క్లారిటీ వ‌చ్చింది. ప్రియ‌మ‌ణి ఎవరే అతగాడు (2003) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జగపతి బాబు హీరోగా వచ్చిన ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో తెలుగువారికి మరింత పరిచయమైంది.

2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని నాలుగేళ్లు దాటిపోయింది. ఇద్దరూ తమ తమ కెరీర్స్ లో బిజీగా ఉన్నారు. నటిగా ప్రియ‌మ‌ణి చేతి నిండా ఆఫర్స్ తో వరుస సినిమాలు చేస్తున్నారు. భర్త ముస్తఫా రాజ్ అమెరికాలో ఆయన ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat