దేశంలో గడచిన 24 గంటల్లో 10,126 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 3,43,77,113కు చేరింది. తాజాగా 332 మంది వైరస్లో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4,61,389గా ఉంది.
ఇక కొత్తగా 11,982 మంది మహమ్మారి నుంచి బయటపడగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,37,75,086గా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,40,638 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు ఇప్పటివరకు 109,08,16,356 వ్యాక్సిన్ డోసులు వేశారు.