Home / SLIDER / డిసెంబరులోగా కొత్త మెడికల్‌ కాలేజీల భవనాలను పూర్తి చేయాలి

డిసెంబరులోగా కొత్త మెడికల్‌ కాలేజీల భవనాలను పూర్తి చేయాలి

 ఆరోగ్యశ్రీకి అదనంగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద 646 వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం చేర్చిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఈ అదనంగా చేర్చిన వైద్యసేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా 946 రకాల వైద్య సేవలను అందిస్తున్నామన్నారు.

శనివారం బీఆర్కే భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఇక నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని, జిల్లా ఆస్పత్రులు, వైద్య విద్య కళాశాలలను కూడా సర్‌ప్రైజ్‌ విజిట్‌ చేసి, అక్కడే సమీక్షలు చేస్తానని పేర్కొన్నారు.

జిల్లాల్లో ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల పనితీరును మెరుగుపరిచి ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు నిరంతరం వాటిపై పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలను ఆయన ఆదేశించారు. ఆస్పత్రుల్లో రోగుల శాతం, శస్త్రచికిత్సలపై సమీక్ష చేయాలన్నారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat