దేశంలో కొత్తగా 8309 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,80,832కు చేరింది. ఇందులో 3,40,08,183 మంది కోలుకున్నారు. మరో 1,03,859 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 4,68,790 మంది మృతిచెందారు.
కాగా, గత 24 గంటల్లో 9905 మంది కరోనా నుంచి బయటపడగా, 236 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు 544 రోజుల కనిష్ఠానికి చేరాయని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.34 శాతంగా ఉందని పేర్కొన్నది. కొత్తగా నమోదైన కేసుల్లో 4350 కేసులు కేరళలోనే ఉన్నాయని, 159 మంది మరణించారని తెలిపింది.