దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 9419 కేసులు నమోదవగా.. తాజాగా 8,503 రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,74,744కు చేరాయి.
ఇందులో 3,41,05,066 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,74,735 మంది వైరస్కు బలయ్యారు. మరో 94,943 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
కాగా, గత 24 గంటల్లో 7,678 మంది కరోనా నుంచి కోలుకోగా, 624 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,31,18,87,257 కరోనా డోసులు పంపిణీ చేశామని తెలిపింది.