దేశంలో కొత్తగా 7774 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కి చేరింది. ఇందులో 3,41,22,795 మంది కరోనా నుంచి కోలుకోగా, 92,281 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
మరో 4,75,434 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 306 మంది మరణించగా, 8464 మంది కోలుకున్నారని తెలిపింది.దేశంలో యాక్టివ్ కేసులు 560 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొంది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.27 శాతమని వెల్లడించింది. 2020 మార్చి తర్వాత కరోనా రికవరీ రేటు గరిష్ఠానికి చేరిందని, ప్రస్తుతం 98.36 శాతంగా ఉందని తెలిపింది. ఇక శనివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా 1,32,93,84,230 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.