కొవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కోర్టు పేర్కొన్నది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది
క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాని కోర్టు సూచించింది. రాష్ట్రాల సరిహద్దుల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఒమిక్రాన్పై అప్రమత్తంగా ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది