ఏపీలో కొత్తగా మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 17కు చేరింది. UAE నుంచి బెంగళూరు ఎయిర్పోర్టులో దిగి ప్రకాశం జిల్లాకు వచ్చిన 52 ఏళ్ల మహిళకు డిసెంబర్ 24న కరోనా పాజిటివ్ గా తేలింది.
ఆమె నమూనాలను HYD సీసీఎంబీలో పరిశీలించగా.. ఒమిక్రాన్గా నిర్ధారణ అయ్యింది. ఆమెకు సన్నిహితంగా ఉన్న 14 మందికి కరోనా టెస్టులు చేయగా.. నెగిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు.