ముంబైలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. గత 24 గంటల్లో 5,428 కోత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ కేసుల 2,510 అధికం. అటు మహారాష్ట్రవ్యాప్తంగా 8,067 కేసులు నమోదయ్యాయి.
8 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.