తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న నిప్పు ఇంకా చల్లారినట్లు లేదు.. ఆ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నరు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి వెళ్తారు అని వార్తలు వైరల్ అయిన సంగతి విధితమే.
తనపై వస్తున్న వార్తల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.నేనంటే గిట్టనివాళ్లు..నా వ్యతిరేకులు నాపై బురద చల్లే క్రమంలో ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేసేవాళ్ల గురించి అధినేత్రి సోనియా గాంధీకి వివరిస్తాను.నేను పార్టీ మారాల్సి వస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇంట్లో ఉంటాను తప్పా కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.