తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్విటర్లో నిర్వహించిన #askktrలో భాగంగా ఓ నెటిజన్ లాక్ డౌన్ గురించి ప్రశ్నించాడు. దానికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కరోనా కేసుల సంఖ్య, వైద్యశాఖ అధికారుల సలహాను బట్టి లాక్డౌన్ నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
కాగా.. తెలంగాణలో 18,339 యాక్టివ్(నిన్నటి వరకూ) కేసులున్నాయి. రోజుకు దాదాపు 2000కేసులు వెలుగు చూస్తున్నాయి.