తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఇవాళ్టితో ఆంక్షల గడువు ముగుస్తున్న తరుణంలో ఈ నెలాఖరు వరకు పొడిగించింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ మహమ్మారి కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది.
ఇదిలా ఉండగా.. రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రేపటి నుంచి ప్రారంభమయ్యే సర్వేకు సంబంధించిన టెస్ట్ కిట్లు, మెడికల్ కిట్లను ఆయా పీహెచ్సీలకు తరలించినట్లు మంత్రి హరీశ్రావు మీడియా సమావేశంలో వెల్లడించారు.