కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కరోనా టెస్టుల ధరలను తగ్గించింది. గతంలో రూ.499గా ఉన్న కరోనా టెస్టు ధరను రూ.350కి తగ్గించింది. దీంతో తెలంగాణలో కూడా ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలంటున్నారు. కాగా తెలంగాణలో కరోనా టెస్టుల కోసం కొన్ని ల్యాబ్లో రూ.500 నుంచి రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు.