Home / MOVIES / ‘సర్కారు వారి పాట’ పై Good News

‘సర్కారు వారి పాట’ పై Good News

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ తాజా షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారని సమాచారం. ఆ మద్య మహేశ్ కాలికి చిన్న సర్జరీ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దీని తర్వాత ఆయన కరోనా బారిన కూడా పడ్డారు.

వీటి  కారణంగా కొన్ని రోజులు ఈ మూవీ షూటింగ్‌కు చిత్రబృందం బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన అన్నిటి నుంచి పూర్తిగా కోలుకొని షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు తయారయ్యారట. దాంతో ‘సర్కారు వారి పాట’ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను తాజాగా ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగా  ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మహేశ్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్టు లేటెస్ట్ న్యూస్ వచ్చి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, మొత్తం చిత్రీకరణ మార్చ్ వరకు పూర్తి చేయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.   

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat