దేశంలో ఉన్న దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ శపించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్కు లేదన్నారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన దళితులే కేసీఆర్ను కిందకు దించుతారని హెచ్చరించారు.
బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారన్నారు. ప్రగతి భవన్ నుంచి ప్రజలు రోడ్డు మీదకు ఈడ్చుతారని కేసీఆర్కు అర్థమైందని అన్నారు. తిట్లు తిట్టడం ఎలా అనే పుస్తకాలను మాత్రమే కేసీఆర్ చదువుతారని యెద్దేవా చేశారు. బడ్జెట్ గురించి కాకుండా బీజేపీని తిట్టడం కోసమే కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టారని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు.