Home / SLIDER / కార్యకర్తలకు అందుబాటులో ఉంటా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తా

కార్యకర్తలకు అందుబాటులో ఉంటా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తా

నిత్యం కార్య కర్తలకు అందుబాటులో ఉంటూ మెదక్ జిల్లాలో టీ ఆర్ ఎస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెరాస జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి లభించిన తరువాత తొలిసారిగా మెదక్ వచ్చిన ఆమెకు జిల్లా సరిహద్దు లోని కాళ్ళ కల్ దగ్గర నుంచి మెదక్ పట్టణం వరకు పార్టీ నాయకులు, కార్య కర్తలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

పలు చోట్ల గజ మాలలతో సత్కరించారు. ఈ సందర్బంగా మెదక్ లో జరిగిన సన్మాన సభలో పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షడు ముఖ్యమంత్రి కే సీ ఆర్ తనపై నమ్మకం ఉంచి అప్పగించినా బాధ్యతను చిత్త శుద్ధితో నెరవేరుస్తానన్నారు.

ప్రస్తుతం నెలకు రెండు రోజులు మీ కోసం పేరుతో నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుండగా, ఇక నుంచి జిల్లా లోని పార్టీ కార్య కర్తలకు సైతం ఇదే విధంగా నెలలో మూడు రోజులు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంటానని వెల్లడించారు. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తనకు జిల్లా వ్యాప్తంగా ఘన నీరాజనం పలికిన టీ ఆర్ ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, వ్యాపారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat