దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,059 మంది వైరస్ మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,01,114కు చేరింది.
ఇక కొత్తగా 2,30,814 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 13,31,648 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 168,98,17,199 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.