తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ పేరును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంతం.ఇటీవలే అక్కినేని వారింట నుండి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ యర్నెని ,వై రవి శంకర్ నిర్మాతలుగా నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా సునీల్,అనసూయ ప్రధానపాత్రలుగా వచ్చిన పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ సినీ ప్రేక్షకులను అలరించింది.
తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ ప్తముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ తను ఈ స్థాయికి రాకముందు పడిన కష్టాల గురించి చెప్పుకుంటూ వచ్చింది.. ఒకప్పుడు ఐదు వందల కోసం రోజు పని కూడా చేశానని చెప్పుకోచ్చింది. ఇందులో భాగంగా పెద్ద పంక్షన్స్ కు హజరయ్యే అతిధులకు స్వాగతం చెప్పే అమ్మాయిలాగా పని చేశాను. అందుకు నాకు ఐదు వందలు ఇచ్చేవారు అని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అయితే చదువుల్లో మంచి నైపుణ్యం ఉన్న కానీ పైచదువులు చదవడానికి డబ్బులు లేక చదువు మానేశాను. కొన్ని కొన్ని సార్లు డబ్బులేక ఒక్క పూట కూడా భోజనం చేసే పరిస్థితులను అనుభవించాను అని అమ్మడు అప్పుడు పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది.