తెలంగాణలోని వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు హన్మకొండలోని వారి నివాసంలో చెక్కులు అందచేసిన పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు.
ఈ సందర్భగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ ఆడపడుచులకు పెద్దపీట వేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకానికి మహిళల పేర్లతో ప్రవేశపెట్టి తెలంగాణ ఆడపచులమీద వారికి ఉన్న ప్రత్యేకతను కేసీఆర్ గారు చాటారన్నారు.
పేదింట ఆడపడుచుకు మేనమామగా అండగా నిలిచి కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.100116/- అందచేస్తున్న ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. మహిళల భద్రతకోసం షీటీమ్స్ ఏర్పాటు చేసిన ఘనత తెరాస ప్రభత్వానిదేనన్నారు.కళ్యణలక్ష్మి చెక్కులు మంజూరి అయిన గ్రామాలు చింతలపల్లి,ఎల్గురు రంగంపేట,గవిచెర్ల,లోహిత,మొండ్రాయి,నల్లబెల్లి,నార్లవాయి,పల్లారుగూడ,సంగెం, తీగరాజుపల్లి గ్రామాల నుండి 39 మంది లభ్డిదారులకు రూ.39.00 లక్షలకు పైగా విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే గారు పంపిణీ చేశారు.