కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఎమ్మెల్యే గారి సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు.
అదే విధంగా కాలనీలో నూతనంగా కమ్యూనిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి తన బడ్జెట్ నుండి రూ.10 లక్షలు కమిటీ హాల్ నిర్మాణం కోసం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ గౌడ్, జనరల్ సెక్రెటరీ రవీందర్ గౌడ్, కో-జనరల్ సెక్రెటరీ పరమేశ్వర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, క్యాషియర్ బాపిరెడ్డి, మరియు వైస్ ప్రెసిడెంట్ విజయ్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.