తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 6 ఇమామ్ గూడ లో 15 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు,వరద నీటి పైప్ లైన్ పనులకు,వార్డు నెంబర్ 7 మంఖాల్ లో 21 లక్షల 50 వేల రూపాయల తో నిర్మించే సీసీ రోడ్డు మరియు భూగర్భ మురికి నీటి కాలువ పనులకు,వార్డు నెంబర్ 7,8 లలో మంఖాల్ గ్రామంలో 8 లక్షల నిధులతో వీధి విక్రయదారుల సముదాయము(స్ట్రీట్ వెండింగ్ జోన్) పనులకు,వార్డు నెంబర్ 8 మంఖాల్ లో 13 లక్షలతో ఏర్పాటు చేసే ఓపెన్ జిమ్ మరియు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ..
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ నూతన మునిసిపాలిటీల అభివృద్ధి కి ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి గారి మార్గదర్శనం లో మునిసిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే టి ఆర్ గారు పట్టణాలకు నూతన హంగులు కల్పించటానికి,కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారన్నారు.
తాగునీరు,రోడ్లు,డ్రైనేజి,నాళాల ఏర్పాటు,విధిదీపాలు,చెరువుల సుందరికరణ పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఇటీవలి ఒకే రోజు నియోజకవర్గములోని రెండు కార్పొరేషన్లు,మునిసిపాలిటీ లలో 371 కోట్ల రూపాయల నిధుల కు సంభందించి కేటీఆర్ గారితో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమాలలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి గారు,కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.