Home / SLIDER / మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలి

మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలి

ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు పిలుపునిచ్చారు.శనివారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కోర్ట్ హాల్ నుండి మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆర్థిక శాఖ, ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష అయిన కేజీ టు పీజీ కి అనుగుణంగా అడుగులు ముందుకు పడుతున్నాయని, మనందరికీ ఎంతో సంతృప్తిని అందించే ఈ మహత్తర కార్యంలో అందరూ భాగస్వాములై అంకిత భావంతో పని చేయాలని కోరారు. తొలి విడతగా మూడో వంతు పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించినప్పటికీ, దీని ద్వారా 60 శాతం మంది విద్యార్థిని, విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని మంత్రులు పేర్కొన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సమాన నిష్పత్తిలో ఎంపిక చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనను మెరుగుపర్చే పనులు జరిపించాలని సూచించారు. ఈ కార్యక్రమం అమలైన బడులలో అన్ని వసతులతో చక్కటి వాతావరణం కల్పించడం ద్వారా కార్పొరేట్ స్కూళ్లను మరిపించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని అన్నారు. అవసరమైన చోట మరమ్మతు పనులను చేపడుతూ, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లాబరేటరీ, లైబ్రరీ, ప్రహరీ గోడ, కిచెన్ షెడ్స్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నీచర్, డిజిటల్ విద్యా బోధనకు సంబంధించినవి తదితర పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. తొలి దశలో 3497 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ, 371 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరిపించాలని నిర్ణయించామని తెలిపారు. అయితే పనుల అంచనాలను పక్కాగా నిర్ధారిస్తూ రూపొందించేలా చూడాలని, లేని పక్షంలో నిధులు వృధా అయ్యే అవకాశం ఉంటుందని కలెక్టర్లకు సూచించారు. ఏ పాఠశాలలో ఏయే సౌకర్యాలు అందుబాటులోకి తేవాల్సి ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ బడులను సందర్శించాలని కలెక్టర్లను కోరారు. అత్యధికంగా 790 మంది మొదలుకుని వందకు పైగా విద్యార్థులు ఉన్న పాఠాశాలలను తొలి విడత జాబితాలో ఎంపిక చేయాలని సూచించారు. పాఠశాల నిర్వహణ కమిటీ ద్వారా అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయాలని, ఎస్ ఎం సి చైర్మన్ తో పాటు స్థానిక సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడు, ఇంజినీరింగ్ విభాగం ఏ.ఈ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.

మన ఊరు – మన బడి కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పి చైర్మన్లతో పాటు జెడ్ పీ టి సి లు, గ్రంథాలయాల చైర్మన్లు తదితర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని సూచించారు. విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చే ఎన్ఆర్ఐ లు, పూర్వ విద్యార్థులు, ఇతర దాతలను ప్రోత్సహించాలని, వారి ఆర్ధిక సహకారంతో బడులను మరింతగా అభివృద్ధి చేసుకోగల్గుతామని అన్నారు. ఎవరైనా పాఠశాలకు రూ. పది లక్షలు విరాళం ఇచ్చినట్లయితే తరగతి గదికి వారి పేరు పెట్టవచ్చని, 25 లక్షలు విరాళం అందిస్తే పాఠశాలలోని ఓ విభాగం మొత్తానికి వారి పేరు పెట్టాలని సూచించారు.జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ, మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, పనులను గ్రౌండింగ్ చేసే సమయానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, సన్నద్ధమై ఉంటామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్సులో పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్, కమిషనర్ దేవసేన, జెడ్పి చైర్మన్ అనిత హరనాథ్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జెడ్పి సి ఈ ఓ దీలిప్ కుమార్, డీ ఆర్ డీ ఓ ప్రభాకర్, విద్య శాఖ అధికారి సూసిందర్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat