దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,80,235కి చేరింది.
దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల మొత్తం నుండి దాదాపు 4,19,77,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,905 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 2,92,092 మంది చికిత్స పొందుతున్నారు.
అయితే గురువారం తో పోల్చుకుంటే ఇవి 4837 తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా 492 మంది మరణించారని, 66,254 కరోనా నుంచి బయటపడ్డారని ఆరోగ్య శాఖ తెలిపింది.