వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్ (65), వెంకటేశ్ అయ్యర్ (35 నాటౌట్) విజృంభించడంతో 184/5 రన్స్ చేసింది.
185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ను 167/9 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ తలో 2 వికెట్లు తీశారు. దీంతో సిరీస్ను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసింది.