ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకటరావు (102) కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన కూతురు నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.
తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో జన్మించిన ఈయన.. 1967, 1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-80 మధ్య వ్యవసాయశాఖ మంత్రిగా చేశారు. 1983లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. 1995లో గుంటూరు జడ్పీ ఛైర్మన్ గా, 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సంగం డెయిరీ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా యడ్లపాటి వెంకటరావు గారే.