Home / MOVIES / పవన్ అభిమానులకు శుభవార్త

పవన్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా  ఇటీవల విడుదలైన ‘భీమ్లానాయక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో దాదాపు రూ. 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టినట్టు సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ జానపద చిత్రంలో నటిస్తుండగా.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఇవిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ తాజాగా మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అతడు మరెవరో కాదు. ప్రభాస్ తో ‘సాహో’ చిత్రాన్ని తీసిన సుజిత్. సాహో తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టింది.  సాహో తర్వాత కొన్ని కథలపై కసరత్తులు చేస్తున్న సుజిత్ దృష్టిలో ఓ తమిళ సినిమా రీమేక్ పడిందట. గతంలో విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘తెరి’  ఆధారంగా ఒక కథ రాసుకున్నాడట. ఇదే సినిమా అప్పట్లో ‘పోలీస్’ గా తెలుగులో డబ్ అయింది. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat