Home / SLIDER / మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో కిడ్నాప్ కలకలం

మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో కిడ్నాప్ కలకలం

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ,బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ సంఘటన సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి  ఎనిమిదిన్నరకు జరిగిన ఈ ఘటనలో  సౌత్ అవెన్యూలో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా ,మహబూబ్ నగర్ కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను అపహరించారని జితేందర్ రెడ్డి పీఏ రాజు మంగళవారం మధ్యాహ్నాం స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.

సోమవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అపహరించారని పిర్యాదులో పీఏ రాజు ఆరోపించారు.  అయితే 2018సార్వత్రిక ఎన్నికల్లో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ఒక మంత్రి పై మున్నూరు రవి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat