Home / ANDHRAPRADESH / నాడు అలా.. నేడు ఇలా… వైఎస్ సునీత తీరు…

నాడు అలా.. నేడు ఇలా… వైఎస్ సునీత తీరు…

ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదాంతం ఇప్పుడు ఏపీ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే. ఏపీ ప్రజల మన్నలను పొందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై వైఎస్ వివేకానందరెడ్డి తనయ సునీతమ్మ,ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలను పావులగా వాడుకోని ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బురద చల్లుతున్నాడు అని వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

నాడు సంబంధం లేదని నేడు వైఎస్ కుటుంబంపై నిందలు వేస్తున్నారు అని గతంలో సునీతమ్మ మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా సజ్జల గుర్తు చేశారు. 2019మార్చి 26న హైదరాబాద్ మహానగరంలోని ప్రెస్ క్లబ్  మీడియా సమావేశంలో   సునీత మాట్లాడుతూ”మానాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో మా కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదు. మా కుటుంబ సభ్యులకే సంబంధం ఉండి ఉంటే పోలీసులు ఇప్పటికే బయటపెట్టేవారు.

హంతకులను పట్టుకోకుండా సిట్ అధికారులు ఏదో విషయం దాస్తున్నారు. విచారణ సరిగా జరగడం లేదు.వీళ్ళే చేశారంటూ కొన్ని రోజుల తరువాత మా కుటుంబ సభ్యులనే దోషులుగా చూపించే అవకాశం ఉంది. ఆభయంతోనే చెబుతున్న మా కుటుంబ సభ్యులే లక్ష్యంగా ఆదినారాయణ రెడ్డి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో మేముంటే మాపైన పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ కుట్రతో ఇతరత్రా ప్రయోజనాలు ఆశించి మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారన్న భయం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తి చేసి ఉంటే ఆ అనుమానం వచ్చేది కాదు. సిట్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం లేదు, నాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని” మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా సజ్జల గుర్తు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat