పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు తల్లిగా నటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని భాగ్యశ్రీ తెలిపింది.
అతడితో నటించేటప్పుడు సెట్లో కుటుంబ వాతావరణం ఉండేదని చెప్పింది. పెద్ద హీరో అనే గర్వాన్ని ప్రభాస్ ఎన్నడూ చూపలేదని పేర్కొంది. అతను తోటి వ్యక్తులతో ఎంతో సరదాగా ఉంటాడని తెలిపింది. ప్రేమ పావురాలు చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, పలు చిత్రాల్లో అలరించిన భాగ్యశ్రీ చాలా ఏళ్ల తర్వాత తెలుగులో నటిస్తోంది.