శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తానే మెసేజ్ పంపించానని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో వెంటనే ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు దించాలని సూచించానన్నాడు.
శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 175 పరుగుల వద్ద నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అతను డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంపై విమర్శలు చెలరేగాయి.