మాటల మాంత్రికుడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కాకముందు రైటర్ గా పలు చిత్రాలకు పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ దశలోనే అప్పట్లో ఆయన దాదాపు రూ. 1కోటి పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు అందరికీ షాకిచ్చాయి. ఆయనిప్పుడు టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డైరెక్టర్స్. ప్రస్తుతం ఆయన ఎంత డిమాండ్ చేస్తే నిర్మాతలు అంత ఇచ్చుకొనే పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ అక్షరాలా రూ. 50కోట్లని తెలుస్తోంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘భీమ్లానాయక్’ చిత్రానికి స్ర్కీన్ ప్లే సంభాషణలు అందించి అంతా తనై నడపించిన సంగతి తెలిసిందే. త్వరలో సూపర్ స్టార్ మహేశ్ బాబు 28 వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
దాదాపు 11 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ లో మూడో చిత్రం రానుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం త్రివిక్రమ్ రూ. 50 కోట్లు డిమాండ్ చేశారట. త్రివిక్రమ్ గత రెండు చిత్రాలూ బ్లాక్ బస్టర్స్ సాధించడంతో నిర్మాతలు ఆయన అడిగినంత ఇస్తున్నారని సమాచారం. త్రివిక్రమ్ గత రెండు చిత్రాలూ బ్లాక్ బస్టర్స్ సాధించడంతో నిర్మాతలు ఆయన అడిగినంత ఇస్తున్నారని సమాచారం. ఇక్కడో విశేషమేంటంటే.. సరిలేరు నీకెవ్వురు చిత్రానికిగాను మహేశ్ బాబు రూ. 25కోట్లు పారితోషికం అందుకోగా.. సర్కారు వారి పాట చిత్రం కోసం ఆయన తన పారితోషికాన్ని రూ. 50కోట్లు చేశారట. త్వరలో త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమాకి కూడా మహేశ్ అంతే పారితోషికం తీసుకుంటున్నారు. ఇలా హీరో, దర్శకుడు ఇద్దరూ ఒకే సినిమాకి ఒకే రేంజ్ లో పారితోషికం అందుకోనుండడం విశేషం.