కాలిఫోర్నియా: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. తమ కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన యాపిల్ ఈవెంట్లో కొత్త మోడల్ ఐఫోన్ ఎస్ఈ 5జీని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 5జీ టెక్నాలజీతో వర్క్ చేయనుంది. ఈనెల 18 నుంచి అమెరికా మార్కెట్లో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుంది. 5జీ టెక్నాలజీతో ఇది పనిచేయనుంది. ఈ ఐఫోన్ ఫీచర్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండనున్నాయి. అమెరికాలో దీని ధర 429 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారు 44వేలు. తొలుత ఇవి పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉండనున్నాయి. శుక్రవారం నుంచి ప్రీబుకింగ్ ప్రారంభం కానుంది. రెడ్, వైట్ అండ్ బ్లాక్ కలర్స్లో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుంది.
ఐఫోన్ ఎస్ఈ 5జీ ఫీచర్లు..
– 4.7 ఇంచ్ రెటీనా హెచ్డీ స్క్రీన్
– ట్రూటోన్ ఫ్లాష్ లో 12మెగా పిక్సెల్ కెమెరాస్
-12 ఎంపీ ఫ్రంట్ కెమెరా
– 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్