దిల్లీ: ప్రఖ్యాత సంస్థ గూగుల్తో కలిసి ప్రముఖ టెలికాం కంపెనీ జియో తీసుకొచ్చిన కొత్త మొబైల్ మోడల్ జియో ఫోన్ నెక్స్ట్. ఇటీవల ఇది మార్కెట్లోకి వచ్చింది. కామన్ పీపుల్ని దృష్టిలో ఉంచుకుని అందుబాటు ధర, 4జీ సౌకర్యం, ఇతర కొత్త ఫీచర్లతో ఈ మొబైల్ను డెవలప్ చేశారు. లేటెస్ట్గా ఈ మొబైల్ను ఆఫ్లైన్లోనూ అమ్మకాలు చేపట్టారు. దీని ధర రూ.6,499.
రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, బిగ్ సి, లాట్ మొబైల్ షోరూంలలో ఈ జియో ఫోన్ నెక్స్ట్ను విక్రయిస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్తో వచ్చే ఈ ఫోన్లో 5.45 ఇంచ్ల హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. 2జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజీతో అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా మెమొరీని 512జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కూడా. 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో ఉండే ఈ ఫోన్.. స్నాప్డ్రాగన్ 215 క్యూఎమ్ ప్రాసెసర్తో పనిచేస్తుంది. 3,500 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు బ్లూటూత్, వైఫై, హాట్స్పాట్కు ఇది సపోర్ట్ చేస్తుంది.