Home / SLIDER / అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూయించిన ఎమ్మెల్యే బాల్క సుమన్

అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూయించిన ఎమ్మెల్యే బాల్క సుమన్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గత ఐదు రోజులుగా జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం అసెంబ్లీలో పలు పద్దులపై జరిగిన చర్చల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి  చెందిన ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చురకలు అంటించారు.

సమావేశాల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రజలకు చెందిన ఆస్తిని ,సంపదను  కొల్లగొట్టే తెలివి తమకు కానీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు లేదని ఆయన అగ్రహాం వ్యక్తం చేశారు. సంపదను పెంచడం.

ప్రజలకు పంచడమే తమ టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాల హాయాంలో జరిగిన విధంగా కొంతమందికి పంచే కార్యక్రమం చేయము అని బాల్క సుమన్ తేల్చి చెప్పాడు. సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుంటే కాంగ్రెస్ నేత చెత్త ఆరోపణలు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు బాల్క సుమన్.సింగరేణి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని ఆయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat