దేశవ్యాప్తంగా 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్కు క్యూ కడుతున్నాయి. గతంలో మినిమం రూ.20వేలు పెడితే తప్ప స్మార్ట్ ఫోన్ వచ్చేది కాదు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రూ.5వేల నుంచే స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అయితే త్వరలో 5జీ తరం రాబోతోంది. అందుకే ముందుచూపుతోనే మార్కెట్లోకి మొబైల్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. వాటి ధరలు కూడా కామన్ పీపుల్కి అందుబాటులో ఉంటున్నాయి. లేటెస్ట్గా ఐకూ సంస్థ రూ.15వేలకే స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఐకూ Z6 5జీ పేరిట కొత్త ఫోన్ను బుధవారం విడుదల చేసింది. ఇది 4జీబీ, 6జీబీ, 8 జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 4జీబీ ధర రూ.15, 499, 6జీబీ రేట్ రూ.16,999, 8జీబీ ధర రూ. 17,999గా నిర్ణయించినట్లు ఐకూ సంస్థ తెలిపింది. ఈనెల 22 నుంచి ఈ కామర్స్ సంస్థ అమెజాన్తో పాటు ఐకూ ఇండియా స్టోర్లలో లభించనుంది.
ఫీచర్లు ఇవి..
ఆండ్రాయిడ్ 12
ఫన్టచ్ ఓఎస్ 12,
6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్
128 జీబీ ఇంటర్నల్ మెమొరీ
50 ఎంపీ మెయిన్ కెమెరా.. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ