కోల్కతా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచినంత మాత్రాన గేమ్ ముగిసిపోలేదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయని.. ఈ విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. కోల్కతాలో మీడియాతో మమత మాట్లాడారు.
ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు బీజేపీకి అంత సులువు కావని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో సగం మంది కూడా ఆ పార్టీకి లేరని.. అందుకే గేమ్ ఇంకా ముగిసిపోలేదన్నారు. దేశం మొత్తంపైన బీజేపీ కంటే ప్రతిపక్ష పార్టీలకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు యూపీలో ఓడిపోయినప్పటికీ సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి గతసారి కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారని మమతా బెనర్జీ వివరించారు.