మార్చి నెల మొదటివారం నుండే సూర్యుడు అందర్ని బెంబెలెత్తిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎండలు. ఈ క్రమంలో ఎండకాలం తగిలే వడదెబ్బ నుంచి కింద పేర్కొన్న వాటిని అనుసరించి మనల్ని మనం కాపాడుకుందాం!
* కొబ్బరి నీళ్లు శరీరంలోని తేమ బయటికి పోకుండా కాపాడుతాయి.
* పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
* ఎండలో నుంచి వచ్చాక చల్లని మజ్జిగ తాగితే అలసట ఉఫ్ మని ఎగిరిపోతుంది.
* కీరదోసను టిఫిన్ రూపంలో తీసుకుంటే పోషకాలు అందుతాయి.
* పుదీనా తినడం వల్ల వేడి శరీరం నుంచి బయటికి పోతుంది.