ముఖేష్ అంబానీ ,గౌతమ్ అదానీ ఈ రెండు పేర్లు తెలియని భారతీయుడు ఎవరుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా వీరిద్దరి హావా ప్రస్తుతం దేశంలో నడుస్తుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వీరిద్దరికే అప్పజెబుతుంది అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే వీరిద్దరి సంపద విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రపంచమంతా.. ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారితో కుదేలైపోతుంటే వీరిద్దరి ఆస్తులు మాత్రం అంతకుఅంతకు పెరుగుతూ పోతున్నాయి.
గతఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ సంపద ఇరవై నాలుగు శాతం పెరిగి మొత్తం 103 బిలియన్ల డాలర్లకు చేరింది. ఇక గౌతమ్ అదానీ సంపద అయితే ఏకంగా నూట యాబై మూడు శాతం పెరిగి 81బిలియన్ల డాలర్లకు తాకినట్లు తాజాగా విడుదలైన 2022M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ పదకొండో ఎడిషన్ పేర్కొన్నది. అయితే గత ఏడాది ప్రతివారం ఆరు వేల కోట్లు ఎగబాకింది. దీంతో ఏడాది కాలంలోనే అదానీ సంపద 49బిలియన్ల డాలర్లు పుంజుకొంది. అయితే ఈ మొత్తం టాప్ -3 గ్లోబల్ బిలియనీర్లు అయిన ఎలన్ మస్క్ ,జెఫ్ బెజోస్,బెర్నార్డ్ అర్నాల్ట్ కంటే ఇది ఎక్కువ కావడం విశేషం .