టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మద్యం తయారీకి సంబంధించిన 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలలరీలకు పర్మిషన్ ఇచ్చిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పారు. లిక్కర్ పాలసీపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జగన్ మాట్లాడారు.
నవరత్నాలు, అమ్మఒడి.. ఇవన్నీ తమ ప్రభుత్వ బ్రాండ్లని.. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, భూంభూం బీర్, 999 లెజెండ్, పవర్స్టార్ 999 ఇలా.. ఈ బ్రాండ్లన్నీ చంద్రన్న కానులేనని చెప్పారు. ప్రెసిడెంట్ మెడల్ చంద్రబాబు మెడల్ బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయే వరకూ చంద్రబాబు లిక్కర్ బ్రాండ్లకు పర్మిషన్ ఇస్తూనే ఉన్నారని చెప్పారు.
చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయని.. అవన్నీ ఆయన ట్రేడ్ మార్క్ అని జగన్ ఎద్దేవా చేశారు. తప్పులన్నీ ఆయన చేసేసి బ్రాండ్లను వైసీపీ ప్రభుత్వం క్రియేట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.2019 తర్వాత తమ ప్రభుత్వం ఒక్క బ్రాండ్కు కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నారు. స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్ అంటూ తప్పుడు లేబుల్స్తో ప్రచారం చేసిన ఘనత కూడా టీడీపీ లీడర్లదేనన్నారు. చంద్రబాబు ఇంటిపేరు నారా బదులు సారా అని పెడితే బావుంటుందని ఈ సందర్భంగా జగన్ ఎద్దేవా చేశారు.