టీచర్ల నియామకానికి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష నోటిఫికేషన్ను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. టెట్ నిర్వహణకు ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్ 16 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లను తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్ 12న టెట్ ఎగ్జామ్ను నిర్వహించనున్నారు.
ఇటీవల సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆ ప్రకటన ప్రకారం విద్యాశాఖలో 13వేలకు పైగా పోస్టులు ఉన్నాయి. వీటిలో 10వేల వరకు టీచర్ పోస్టులున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున ముందుగా టెట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది.