ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రైతులు రబీ సీజన్లో పండించిన పప్పు ధాన్యాలు కొనేందుకు వైసీపీ ప్రభుత్వం అంగీకరించింది.దీంతో వచ్చే నెల ఏఫ్రిల్ నుంచి పెసలు, మినుములను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
ఈ సీజన్లో 1,26,270 టన్నుల శనగలు, 91,475 టన్నుల మినుములు, 19,632 టన్నుల పెసలు కొంటామని తెలిపింది. ఇక మద్దతు ధరనూ పెంచింది. శనగలకు క్వింటాల్ రూ.5,230, పెసలు రూ.7,275, మినుములు, కందులకు రూ.6,300 చొప్పున మద్దతు ధర ప్రకటించింది.