RRR సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. భారీ అంచనాలతో ఈనెల 25న రిలీజ్ అయిన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్, రామ్చరణ్ నటన.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై అభినందనల వర్షం కురుస్తోంది. తాజా మహేశ్బాబు ఈ మూవీని చూసి ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాను చూడటాన్ని గర్వంగా భావిస్తున్నానని.. మూవీలోని ప్రతి అంశం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు.
ఆర్ఆర్ఆర్ ఎపిక్ అని.. అద్భుతమైన విజువల్స్, గుండెల్ని పిండేసేలా ఎమోషన్స్ ఊహించని స్థాయిలో ఉన్నాయని ట్వీట్లో చెప్పారు. కొన్ని సీన్స్ మర్చిపోలేమని.. అలా చేయడం రాజమౌళి ఒక్కడికే సాధ్యమని కొనియాడారు. ఎన్టీఆర్, రామ్చరణ్ తమ స్టార్డమ్ను దాటి వెళ్లిపోయారన్నారు. స్క్రీన్పై వాళ్ల ఫర్ఫార్మెన్స్ అద్భుతమని.. ప్రేక్షకులకు గొప్ప ప్రాజెక్టు అందించిన మూవీ టీమ్కు అభినందనలు తెలుపుతున్నట్లు మహేశ్బాబు తన ట్వీట్లో పేర్కొన్నారు.