మేకపాటి గౌతమ్రెడ్డి లేని లోటును భర్తీ చేయలేమని.. ఆయన మృతిని ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నామని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం మాట్లాడారు. గౌతమ్ కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబానికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు.
తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీ ఎంపీగా మేకపాటి రాజమోహన్రెడ్డి తనకు అండగా నిలబడేందుకు గౌతమ్రెడ్డే కారణమని చెప్పారు. గౌతమ్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల అతడి ఒత్తిడితోనే రాజమోహన్రెడ్డిని తనవైపు ఉండేలా చేశాడన్నారు.
2009 నుంచి సాగిన ఆ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ స్నేహితుడిగా గౌతమ్ తోడుగా నిలిచాడని జగన్ చెప్పారు. తాను లేకపోయుంటే అతడు రాజకీయాల్లోని రాకపోయేవాడేమో అన్నారు. మంచి నాయకుడి, ఎమ్మెల్యేగా, మంత్రిగా పేరుసంపాదించాడని జగన్ కొనియాడారు. గౌతమ్రెడ్డి సేవలకు గుర్తుగా సంగం బ్యారేజ్కు ఆయన పేరు పెడతామని సీఎం ప్రకటించారు. మే 15లోపు బ్యారేజ్పనులు పూర్తిచేసి ప్రారంభిస్తామని తెలిపారు.