Home / MOVIES / ఓటీటీలో ‘రాధేశ్యామ్‌’.. మరీ ఇంత త్వరగానా!

ఓటీటీలో ‘రాధేశ్యామ్‌’.. మరీ ఇంత త్వరగానా!

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే కలిసి నటించిన లవ్‌ బేస్డ్‌ మూవీ ‘రాధేశ్యామ్‌’ త్వరలో ఓటీటీలో రానుంది. ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. జ్యోతిష్యం చెప్పే వ్యక్తిగా ప్రభాస్‌ ఈసినిమాలో నటించారు. ముఖ్యంగా సినిమాలో సముద్రంలో షిప్‌ సీన్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్‌- పూజా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండింది.

అయితే కథలో పెద్దగా బలం లేకపోవడం.. పూర్తిగా ప్రేమకథా చిత్రం కావడంతో  ప్రేక్షకులను మరీ అంతగా అలరించలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ కొనుగోలు చేసింది.  దీంతో త్వరగానే.. అంటే ఏప్రిల్‌ 1వ తేదీన ‘రాధేశ్యామ్‌’ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదల చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను అమెజాన్‌ సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat