Home / SLIDER / మరోక సారి వార్తల్లో నిలిచిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య – నెటిజన్లు ఫిదా..?

మరోక సారి వార్తల్లో నిలిచిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య – నెటిజన్లు ఫిదా..?

ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత. ఎమ్మెల్యేగా గెలుపొందిన గెలవకపోయిన కానీ నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తనదైన శైలీలో పోరాడుతూ అందరి మన్నలను పొందుతూ ఉంటారు. తాజాగా అదే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ వార్తల్లోకెకారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . ఇంతకూ ఆయన ఎవరు అనే కదా మీ ఆలోచన. ఆయనే మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య .

ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కానీ ఏనాడూ హంగులు అర్భాటాలకు పోకుండా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వాటికి చాలా దూరంగా ప్రజలకు దగ్గరగా జీవిస్తున్నారు. ఇప్పటికి ఆయన సర్కారు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తారు. తాజాగా ఆయన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరెట్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు వచ్చారు.

అయితే అనుకున్న సమయానికి కంటే ముందుగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అందరిలెక్క కలెక్టర్ రాకకోసం ఎదురుచూశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ వచ్చాక అతడ్ని కలిసి పోడు భూముల పరిష్కారం గురించి వినతి పత్రం అందించి వెళ్లారు. దీంతో నెటిజన్లు గుమ్మడి నర్సయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు.  ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కానీ ఏ మాత్రం గర్వం లేకుండా సామాన్యుడిలెక్కనే అందరూ ఎదురుచూసే వెయిటింగ్ హాలో కూర్చుని ఉండటం ఆయన కమిట్మెంట్ సింపుల్ సిటీకి నిదర్శనం అని పోస్టులు పెడుతూ పొగడ్తలు కురిపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat